Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

‘రామాయ‌ణం’లో సుగ్రీవుడు పాత్ర పోషించిన న‌టుడు కన్నుమూత!

$
0
0
ఒకప్పుడు టెలివిజన్రంగంలో దూరదర్శన్ కి ఎంతో ప్రాముఖ్యత ఉండేది.  ఆ కాలంలో వచ్చిన సీరియల్స్ కూడా ఎంతో గొప్ప ఆదరణలకు నోచుకున్నాయి. అలాంటి సీరియల్స్ లో రామాయణం, మహాభారతం.   ప్ర‌స్తుతం కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార‌స‌మాచార శాఖ‌.. మ‌రోసారి రామ‌య‌ణం సీరియ‌ల్‌ను దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం చేస్తుంది.  తొలిసారి రామ‌య‌ణం సీరియ‌స్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది.

ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసింది.  తాజాగా  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేస్తారు. రామాయ‌ణం సీరియ‌ల్‌లో సుగ్రీవుడు మ‌రియు బాలి పాత్ర‌ల‌ని పోషించిన ప్ర‌ముఖ న‌టుడు శ్యామ్సుంద‌ర్ కాళాని క‌న్నుమూశారు. ఈ సీరియ‌ల్‌లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ త‌న సోషల్ పోస్టింగ్  ద్వారా శ్యామ్చ‌నిపోయార‌నే విష‌యాన్ని ధృవీక‌రించారు. ఆయ‌న‌కి సంతాపం కూడా తెలిపారు. 



సుగ్రీవుడు, బాలిగా ద్విపాత్రాభినయం చేసి ఎంతో పాపుల‌ర్ అయిన‌ శ్యామ్‌సుందర్ కాలానీ కొద్ది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు.  2020ఏప్రిల్ 7 న కల్కాలో నటుడు తుది శ్వాస విడిచిన‌ట్టు తెలుస్తుంది.  కాగా, శ్యామ్సుంద‌ర్ కాళాని మరణానికి లక్ష్మణ్పాత్ర పోషించిన నటుడు సునీల్లాహ్రీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  మా తోటి న‌టుడు శ్యామ్కలాని  ఆకస్మిక మరణం  చెందార‌నే వార్త న‌న్ను ఎంత‌గానో బాధించింది. వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు 

]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>