Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

బిగ్ బ్రేకింగ్ : 250 మందికి భారతీయులకి కరోనా..!!!

$
0
0
ప్రపంచాన్ని కరోనా పట్టిపీడిస్తోంది..ఒకటి తరువాత ఒకటి అన్నట్టుగా అన్ని దేశాలపై తన పంజావిసురుతోంది. ఇప్పటి వరకూ సుమారు సుమారు 97 వేలమంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా చనిపోగా 16 లక్షల మంది పైగా ప్రజలు కరోన బారిన పడ్డారు. ఒక దేశం తరువాత మరొక దేశం పై దండయాత్ర చేస్తున్న కరోనా ప్రస్తుతం సింగపూర్లో తన ప్రభావాని చూపిస్తోంది. కేవలం గంటల వ్యవధిలో వేలాది కేసులు సింగపూర్లో నమోదు అవుతున్నాయి..ఇదిలాఉంటే

తాజాగా సింగపూర్లో సుమారు 250 మంది భారతీయులు కరోన బారిన పడ్డట్టుగా ఇండియన్హైకమిషన్ వెల్లడించింది. ఈ సంఖ్య అమాంతంగా పెరగడానికి గల కారణాలు అన్వేషించిన హై కమిషన్ అందుకు విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉన్న వారే అత్యధికంగా ఈ కరోన బారిన్ పడ్డట్టుగా తేల్చారు. హై కమిషన్ అధికారి జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ. ఈ 250 మంది భారతీయుల్లలో కొందరు సింగపూర్లోనే స్థిరపడిన భారత సంతతి వాళ్ళు కూడా ఉన్నారని తెలిపారు.



కరోన పాజిటివ్ వచ్చిన వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా వరల్డ్ ఒమీటర్ ఇన్ ఫోన్లో ఇచ్చిన సమాచారం ప్రకారం సింగపూర్లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా సుమారు 2 వేల కేసులు నమోదు అయ్యాయని సుమారు 6 గురు మృతి చెందారని తెలిపారు. సింగపూర్వివిధ కారణాల ద్వార వలస వెళ్ళిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. అక్కడి తాజాగా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హై కమిషన్ అలెర్ట్ గా ఉంటోందని బాధితులకి సత్వరసేవలు అందేలా చర్యలు తీసుకుంటోందని అంటున్నారు భారతీయులు..


]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>