Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305672

ఈ డాక్టర్ కి గుణపాఠం తెలిసొచ్చినట్టే నా ?

$
0
0
నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్సుధాకర్ఇటీవల ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కరోనా వైరస్వ్యాధి గ్రస్తులకు చికిత్స చేసే వైద్యుడు కనీసం మాస్కులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా హాస్పిటల్ కి వచ్చి వెళ్లడం లేదని...కనీస వైద్య సదుపాయాలు కూడా హాస్పిటల్ లో లేవని ఆరోపించారు. ఈ విధంగా కరోనా వైరస్వ్యాధి గ్రస్తులకు చికిత్స చేస్తే నర్సీపట్నం మొత్తం కరోనా వైరస్వ్యాపిస్తుందని పక్క రాష్ట్రం తెలంగాణముఖ్యమంత్రికెసిఆర్ వైద్యులకు ఇస్తున్న ప్రాధాన్యత ఏపీప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శలు చేశారు డాక్టర్సుధాకర్.

అంతేకాకుండా జూనియర్డాక్టర్ల చేత శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారని.. ప్రసూతి నిపుణురాలిని ఇంతవరకు నియమించలేదని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం మొత్తం ఏపీవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారడం తో వెంటనే ప్రభుత్వం ఓ విచారణ కమిటీ వేసింది. అసలు ఆ డాక్టర్చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో ఆసుపత్రి మొత్తం పరీక్షించి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది.



అయితే ఆ తర్వాత డాక్టర్సుధాకర్ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడిన తర్వాత టీడీపీడైరెక్షన్ లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు మొత్తం తతంగమంతా బయటకు రావడంతో ఏపీప్రభుత్వం డాక్టర్సుధాకర్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డాక్టర్సుధాకర్పై ప్రభుత్వం వేసిన సస్పెన్షన్ చాలా పెద్దదని ఈ దెబ్బతో డాక్టర్సుధాకర్కి గుణపాఠం రావడం గ్యారెంటీ అని...వైద్యుడిగా ఉంటూ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన వ్యక్తి లేనిపోని రాజకీయాల్లో దూరితే ఇలా ఉంటుంది అని గుణపాఠం బాగా అర్థమయ్యే ఉంటుంది అని చాలామంది అంటున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305672

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>